మెరుపులు మెరిపించిన ముష్ఫికర్‌ ..

SMTV Desk 2018-03-11 11:21:47  srilanka, bangladesh, t-20 match, mushfiqar rahim

కొలంబో, మార్చి 11 : కొలంబో వేదికగా జరుగుతున్న నిదహాస్ టీ-20 ముక్కోణపు ట్రోఫీ మూడవ మ్యాచ్ లో బంగ్లాదేశ్ శ్రీలంకకు షాకిచ్చింది. ఆతిధ్య జట్టు విసిరినా 215 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే చేధించి సంచలనం సృష్టించింది. తొలుత టాస్ నెగ్గిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేశారు. శ్రీలంక జట్టులో ఫామ్‌లో ఉన్న కుశాల్‌ పెరీరా (74) , కుశాల్‌ మెండిస్‌(57) లు పరుగులతో జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ టీంలో ముష్ఫికర్‌ రహీమ్‌ (72 , 35 బంతుల్లో ) మెరుపు బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనితో పాటు ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (47), లిటన్‌ దాస్‌ (43)రాణించడంతో లంకకు పరాభవం తప్పలేదు. ప్రస్తుతం టోర్నీలో మూడు జట్లు ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకతో తలపడుతుంది.