ముంబై, మార్చి 10 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుద్దిహీనుడు అంటూ ప్రముఖ నటి సోనమ్ కపూర్ ట్వీట్ చేశారు. సోనమ్ అలా అనడానికి గల కారణం ఏమిటంటే.. "అధ్యక్షుడు అమెరికాలో ఏనుగులు, ఇతర జంతువులను వేటాడటానికి ట్రంప్ అనుమతి ఇచ్చారు. ఇది చాలా దారుణమైన విషయమని.. మనమంతా దీన్ని వ్యతిరేకించి ఆపించాలి" అని నటి ఎల్లెన్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన సోనమ్.. "భారతదేశంలో వేటాడటం చట్టవ్యతిరేక చర్య. దీన్ని ప్రపంచం మా నుంచి నేర్చుకోవాలి. ట్రంప్ బుద్ధిహీనుడు" అని కామెంట్ చేశారు. అంతేకాకుండా "భారత పౌరురాలిగా పుట్టడం గర్వంగా ఉంది. మన ప్రపంచాన్ని కాపాడుకుందాం" అనే హ్యాష్ట్యాగ్లు జోడించారు.