కోల్కతా, మార్చి 10 : రాబోయే లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు భాజపా వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకం చేసేందుకు తాను యత్నిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలో మనదేశం ‘సూపర్ ఎమర్జెన్సీ’ని ఎదుర్కొంటు౦దని ఆమె అన్నారు. జాతీయ రాజకీయాల గురించి చర్చించేందుకు మమతాబెనర్జీ ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్తో సమావేశమయ్యారు. మున్ముందు ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు అంశం అవకాశం గురించి చర్చించుకున్నట్లు ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన పటేల్, మమతా బెనర్జీలు చెప్పారు. ‘పిల్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాల్సిందే. భాజపాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలనే మేము కోరుకుంటున్నామని తెలిపారు.