చెన్నై, మార్చి 9 : తమిళనాడులోని చెన్నై నగరం కేకేనగర్లో విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బీకాం చదువుతున్న అశ్విని అనే విద్యార్థినిపై మీనాక్షి కళాశాల వద్ద అళగేశణ్ అనే యువకుడు కత్తితో కిరాతకంగా దాడిచేశాడు. దీంతో గాయాలపాలైన విద్యార్థినిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. అనంతరం అశ్విని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.