త్రిపురను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం : మోదీ

SMTV Desk 2018-03-09 16:24:20  tripura, cm, viplavdev kumar, bjp, government, formation

అగర్తల, మార్చి 9: త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత విప్లవ్‌ దేవ్‌కుమార్‌ నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘త్రిపురను కొత్త శిఖరాలకు తీసుకెళ్దా౦. దాని వల్ల ప్రజల జీవితాలను మార్చొచ్చు, త్రిపురలో అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. . రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగువేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇస్తున్నాను’ అని అన్నారు. ఈ కొత్త ప్రభుత్వం అభివృద్ధి కోసమే పనిచేస్తుందని చెప్పారు. ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌’ నినాదమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ‘ప్రధానిగా నేను చాలా సార్లు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాను. ఈశాన్యంతోనే భారతదేశం. ఇక్కడ సమస్యలను యావత్ దేశం అర్థం చేసుకుంది. ఈశాన్య ప్రజలకు యావత్‌ భారతం తోడుగా నిలుస్తుంది’ అని మోదీ చెప్పుకొచ్చారు.