న్యూఢిల్లీ, మార్చి 9 : పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎంపీలు ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు కూడా ప్లకార్డులు చేతబట్టి ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన అశోక్గజపతిరాజు తొలిసారి ఆందోళనలో పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కోయదొర వేషంలో ఆందోళన చేపట్టారు.