న్యూఢిల్లీ, మార్చి 8 : ఏపీ టీడీపీ సభ్యులు అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం వారు తమ రాజీనామా పత్రాలను మోదీకి సమర్పించి రాష్ట్రానికి న్యాయ౦ చేయడంలో కేంద్రం విఫలమైన కారణంగానే తాము ఇలా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక లేఖను సమర్పించారు. 2014 మే 26న కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా అశోక్గజపతిరాజు, 2014 నవంబర్ 9న శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రిగా సుజనా చౌదరి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానితో సుమారు 10 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. కాగా కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్జైట్లీ.. “ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అసాధ్యం” అని తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయించిన విషయ౦ తెలిసిందే.