హైదరాబాద్, మార్చి 8 : మోదీని మనిషిగా మారుద్దామంటూ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి గతంలో ఇచ్చిన విభజన హామీలపై మోదీ ప్రభుత్వం.. చూపిస్తున్న మొండి వైఖరిపై ఆయన స్పందించారు. “ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను ప్రధాని మోదీకి గుర్తుచేసి ఆయనను మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్ లో అంతర్భాగమని మీరి నిజాయితీగా భావిస్తున్నారా సార్.?” అంటూ మోదీని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను దర్శకత్వం వహించిన "భరత్ అను నేను" చిత్రంలోని టీజర్ ఇటీవల విడుదలై బాగా పాపులర్ అయింది. అందులో వచ్చే ఓ డైలాగ్ను మోదీకి అన్వయిస్తూ కొరటాల శివ.. పై విధంగా ప్రశ్నించారు.