పనాజీ, మార్చి 7 : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్.. వైద్యుల సూచన మేరకు అమెరికా వెళ్తున్నట్లు గోవా గవర్నర్ మృదులా సిన్హాకు లేఖ రాశారు. ఇటీవల ఆయన క్లోమ సంబంధ సమస్యతో లీలావతి ఆసుప్రతిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పారికర్ ముంబై బయల్దేరే ముందు సీనియర్ మంత్రులతో కలిసి తన వ్యక్తిగత నివాసంలో సమావేశమయ్యారు. తన ఆరోగ్యం బాలేనందున అమెరికా వెళ్తున్నానని, తను లేని సమయంలో పాలనా వ్యవహారాలను చూసుకోవలసిందిగా కేబినేట్ సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పారికర్.. "తాను క్షేమంగా ఉండాలని ప్రార్ధించిన అందరికి కృతజ్ఞతలు. పూర్తిగా కోలుకోవడానికి విదేశాలకు వెళ్ళాల్సి రావచ్చు. నా ఆరోగ్యం కోసం మీ ప్రార్థనలను అలాగే కొనసాగించండి" అంటూ తెలిపారు.