కొలంబో, మార్చి 7 : భారత్-శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు సిరీస్కు సంబంధించిన తొలి మ్యాచ్ లో ఒక తప్పిదం చోటు చేసుకుంది. ఈ సిరీస్కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసార హక్కులను డీస్పోర్ట్స్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల ఆటగాళ్లు టాస్ అనంతరం జాతీయ గీతాలాపన ఆరంభించారు. మొదట భారత జాతీయగీతం "జనగణమన" ఆలపించి తర్వాత శ్రీలంక జాతీయగీతం "శ్రీలంక మాత" ఆలపిస్తున్నారు. ఓ పక్క ఈ జాతీయగీతాలాపన జరుగుతుండగానే ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపేసిన డీ స్పోర్ట్స్.. మధ్యలో ప్రకటనలు వేసింది. ఇలా అవమానపరుస్తూ.. ప్రకటనలు వేయడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పద్ధతి సరికాదంటూ తమదైన రీతిలో అభిమానులు స్పందించారు. కాగా ఈ మ్యాచ్లో భారత్.. శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలై౦ది.