వాయిదా పడ్డ ఉభయసభలు..

SMTV Desk 2018-03-07 11:54:43  parliament, lok sabha, rajya sabha, postponed

న్యూఢిల్లీ, మార్చి 7 : పార్లమెంటులో ఉభయ సభలకు ఆరంభంలోనే ఆటంకం ఎదురైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. ఉభయసభల్లో పరిస్థితిని అదుపు చేయడానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సభ ప్రారంభమైన నిమిషంలోపే లోక్ సభ, మూడు నిమిషాల్లో రాజ్యసభ వెనువెంటనే వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.