బాత్ రూంకు వెళ్ళిన మహిళను...రైల్వే ఉద్యోగి

SMTV Desk 2017-06-27 16:38:19  train, lady, passenger, mumbai

ముంబై, జూన్ 27 : రైల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న అతను బాత్ రూంకు వెళ్ళిన మహిళ ను మొబైల్ తో వీడియోలు తీసిన ఘటన లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ... కళ్యాణ్ నగరానికి చెందిన షేక్ సలీం అనే యువకుడు రైల్లో ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. గోరఖ్ పూర్ - లోకమాన్య పూర్ తిలక్ టెర్మినల్ ఎక్స్ ప్రెస్ లో ఏసీ ఎ-1 లో థానే నగరానికి చెందిన మహిళ ప్రయాణిస్తుంది. సలీం అంతకు ముందే మొబైల్ ను మహిళల బాత్ రూంలో వీడియో అన్ చేసి వెంటిలేటర్ పై పెట్టాడు. మహిళ బాత్ రూంకు వెళ్ళింది. అప్పుడు వీడియో రికార్డు అవుతున్న సమయంలో మొబైల్ సౌండ్ రావడంతో మహిళ గమనించి అందులో ఉన్న ప్రయాణికులకు చెప్పగా అతన్ని పట్టుకొని మొబైల్ చెక్ చేసి చుస్తే అందులో చాలా మంది మహిళల నగ్న వీడియోస్ ఉన్నాయి. సలీం గురించి రైల్వే గార్డు కు చెప్పడంతో అతను పోలీసులకు తెలియజేశాడు. నిందితుడైన సలీం పై మహిళలు కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.