పెళ్ళి౦ట తీవ్ర విషాదం.. 25 మంది మృతి...

SMTV Desk 2018-03-06 11:09:35  truck accident, gujarath, 25 members passed away, 11 members injured.

అహ్మదాబాద్, మార్చి 6 : పెళ్లి౦ట తీవ్ర విషాదం నెలకొంది. పచ్చని పందిట్లో కళకళలాడుతూ ఉండాల్సిన వారు మృత్యు కౌగిలిలో వాలిపోయారు. పలువురు ప్రాణాలతో పోరాడుతున్నారు. గుజరాత్ భావ్‌నగర్ సమీపంలో పెళ్ళికి వెళ్తున్న ఓ ట్రక్కు వంతెన పై నుండి అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ ట్రక్కులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రక్కు.. పై నుండి బోల్తా పడడంతో కొన్ని మృతదేహాలు ట్రక్కు కింద ఇరుక్కుపోయాయి. మరికొన్ని మృతదేహాలు పక్కనే ఉన్న నాలాలో పడిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.