లాస్ఏంజెల్స్, మార్చి 5 : అంగరంగ వైభవంగా ప్రారంభమైన 90వ "ఆస్కార్ అవార్డు"ల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2017, 2018 సంవత్సరాల్లో తుదిశ్వాస విడిచిన ప్రముఖ ఆర్టిస్టులను గుర్తుచేసుకున్నారు. అందులో భాగంగా దివంగత బాలీవుడ్ సూపర్స్టార్లు శశికపూర్తో పాటు అతిలోక సుందరి శ్రీదేవికి కూడా నివాళులర్పించారు. ప్రముఖ అమెరికన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడ్డీ వెడ్డర్ స్టేజ్పైన సంగీత ప్రదర్శనతో వీరికి నివాళులు అర్పించారు. శశికపూర్ 2017 డిసెంబర్ లో తుదిశ్వాస విడిచారు. శ్రీదేవి గత నెల 24 వ తేదీన ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి మృతిచెందిన విషయం తెలిసిందే.