చెన్నై, మార్చి 4 : ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందేనని చెన్నైలోని చెపాక్లోని స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేస్తూ.. చెన్నైలో వివిధ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలంటూ స్పష్టం చేశారు. కేంద్రం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు.