"షీ టీమ్స్" దేశానికే ఆదర్శం : నాయిని

SMTV Desk 2018-03-03 14:52:02  home minister naini narsimha reddi, she teams, police expo, hyderaabad.

హైదరాబాద్, మార్చి 3 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించిన షీ టీం ప్రదర్శనను తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... "షీ టీమ్స్ దేశానికే ఆదర్శం. దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్. పోలీస్ ఎక్స్‌పో ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది” అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, సినీ నటి రాశిఖన్నా పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. షీ టీమ్స్ వల్లే హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరిగింది. మహిళల్లో షీటీమ్స్ పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్నాయి. మహిళల భద్రతకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు.