బాకు, మార్చి 2 : అజెర్బైజాన్ రాజధాని బాకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మాదకద్రవ్యాల పునరావాస చికిత్స కేంద్రం (డ్రగ్ రీహాబిలిటేషన్ క్లినిక్)లో శుక్రవారం ఉదయం ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది సజీవదహనమయ్యారని స్థానిక ఏపీఏ న్యూస్ పేర్కొంది. అజెర్బైజాన్ అత్యవసర విభాగానికి చెందిన సహాయక బృందం, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.