ముంబై, ఫిబ్రవరి 28 : ప్రముఖ నటి శ్రీదేవి మృతికి సంతాపంగా ఆమె నివసించిన లోఖండ్వాలా కాంప్లెక్స్లోని గ్రీన్ ఏకర్స్ సొసైటీ ఓ నిర్ణయం తీసుకుంది. మార్చి రెండవ తేదీన హోలీ పండగ సంబరాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మార్చి 2న రెయిన్ డ్యాన్స్, మ్యూజిక్ సిస్టం, కలర్ నీళ్ళు చల్లుకోవడం వంటివి జరపకూడదని నిర్ణయించుకున్నట్టు సొసైటీ చైర్మన్ ఓ లేఖలో పేర్కొన్నారు. కాగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కు చెందిన ప్రముఖులు హాజరై పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మరికాసేపట్లో విలేపార్లే సేవాసమాజ్ హిందూ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి.