చెన్నై, ఫిబ్రవరి 28 : మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి షాక్.. ఆయన కుమారుడు కార్తి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కార్తి చిదంబరంను అరెస్ట్ చేసింది. ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం ఈరోజు ఉదయం లండన్ నుంచి చెన్నై చేరుకున్న కార్తిని విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుంది. ఐఎన్ఎక్స్ మీడియా అంశంలో ఫెరా నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు ఆయన పై ఉన్నాయి.