కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం..

SMTV Desk 2018-02-28 10:32:09  Jayendra Saraswathi , Kamakoti Peetham, passed away, chennai

కాంచీపురం, ఫిబ్రవరి 28 : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నఆయన నిన్న కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాత్రి జయేంద్ర సరస్వతికి ఒక్కసారిగా శ్వాస సమస్యలు రావడంతో శిష్యులు కంచి మఠానికి చెందిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీంతో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. జయేంద్ర సరస్వతి 1935 జూలై 18న తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకిలో జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ. 1954 మార్చి 22న కంచి పీఠంలో చేరిన ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి బాధ్యతలు చేపట్టారు.