మహిళలకు మెగా టోర్నీ...!

SMTV Desk 2018-02-27 15:10:12  ipl, womens team, mega tourney, coa vinod roy

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : ఐపీఎల్.. ప్రపంచ క్రికెట్ చరిత్ర గతిగమనలను మార్చేసిన మెగాటోర్నీ. లలిత్ మోడీ మానస పుత్రికగా చెప్పుకొనే ఈ లీగ్ బీసీసీఐ కు ప్రధాన ఆదాయవనరుగా మారిపోయింది. ఇప్పుడు ఇదే స్పూర్తితో మహిళలకూ ఒక లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నాలను చేస్తుంది. గతంలో కంటే ప్రస్తుతం మహిళా క్రికెట్ కు భారత్ లో ఆదరణ పెరిగిన నేపథ్యంలో లీగ్ నిర్వహణ ఎంతో అవసరమని పాలనా వ్యవహారాల కమిటీ(సీఓఏ) చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ అన్నారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సందర్భంగా నాకౌట్‌ దశలో కొన్ని మహిళల టీ20 మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది.