శ్రీదేవి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..

SMTV Desk 2018-02-27 12:43:19  bjp leader, subramanya swamy, shocking comments on sridevi.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : శ్రీదేవి మరణంపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందలేదని ఆమెను హత్య చేశారంటూ ఆరోపించారు. శ్రీదేవికి ఆల్కహాల్ తాగే అలవాటు లేదన్న ఆయన.. ఆమె శరీరంలో ఆల్కహాల్ ఉందని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. శ్రీదేవి బస చేసిన రాత్రి ఆ హోటల్ కు ఎవరెవరు వచ్చారో చెప్పాలని.. ఆ హోటల్ గది సీసీటీవీ పుటేజ్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆమెకు బలవంత౦గా ఎవరైనా ఆల్కహాల్ ఇచ్చారా? అనే దిశగా విచారణ చేపట్టాలని కోరారు. అలాగే సినిమా తారలతో దావూద్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయాలని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.