ముంబై, ఫిబ్రవరి 26 : శ్రీదేవి పోస్టుమార్టం నివేదికను వైద్యులు బయటపెట్టారు. ఆమె ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి మృతి చెందినట్లు దుబాయ్ డాక్టర్లు తమ నివేదికలో పొందుపరిచారు. ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఇక ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించే ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రస్తుతం ఆమె పాస్పోర్ట్ను రద్దు చేసి మరో గంట సమయంలో ఆమె పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించనున్నారు.