కరీంనగర్, ఫిబ్రవరి 26 : కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన లైన్మెన్ కుందారపు గోపాల్ ఆల్టో కారులో కరీంనగర్ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో బైపాస్ రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ కారులో డీజిల్ పోసుకుని యూటర్న్ తీసుకుంటుండగా లైన్మెన్ గోపాల్ ప్రయాణిస్తున్న కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.