ముంబై, ఫిబ్రవరి 26 : శ్రీదేవి మరణ వార్త విన్న పాక్ నటి సజల్ అలీ.. చాలా భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీదేవి చివరి చిత్రం "మామ్" లో తన కుమార్తెగా నటించిన సజల్.. బాధ తప్త హృదయంతో "ఈరోజు నేను నా తల్లిని మరోసారి కోల్పోయాను" అంటూ తన ఇంస్టాగ్రామ్ లో శ్రీదేవితో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. మామ్ సినిమా షూటింగ్ సమయంలో సజల్ తల్లి మరణించారు. అలాంటి కష్టకాలంలో శ్రీదేవి సజల్ ను ఒక తల్లిలా ఆదరించి ఒక సొంత కుమార్తెలా చూసుకున్నారు. షూటింగ్ ముగిసిన తర్వాత సజల్ ను వదిలి వెళ్ళే ముందు శ్రీదేవి ఎంతో భావోద్వేగంతో మాట్లాడిన విషయం తెలిసిందే.