ఆమెను "శవం" అంటున్నారు ఎందుకు.? : రిషి కపూర్

SMTV Desk 2018-02-26 11:51:27  sridevi dead body, rishikapoor shocking comments, mumbai.

ముంబై, ఫిబ్రవరి 26 : శ్రీదేవి హఠాన్మరణాన్ని యావత్ భారతదేశం జీర్ణించుకోలేకపోతోంది. ఆమె పార్థివదేహం స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె భౌతిక కాయం తరలింపు విషయంలో ప్రముఖ నటుడు రిషికపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో.. "ఒక్కసారిగా శ్రీదేవి శవం(బాడీ) ఎలా అయిపోతుంది? ఆమె శవాన్ని ముంబైకి తరలిస్తారని అన్ని టీవీ ఛానెళ్లూ చెబుతున్నాయి. ఆత్మీయులు మనకు దూరం కాగానే కేవలం శవంగా మారిపోతారా?" అంటూ ప్రశ్నించారు. కాగా రిషికపూర్, శ్రీదేవి కలిసి "చాందిని" చిత్రంలో నటించారు.