న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : పార్లమెంటులో భాగమైన రాజ్యసభ (పెద్దల సభ) పోరుకు ముహర్తం ఖరారు అయ్యింది. ఏప్రిల్ 2న పదవీకాలం ముగియనున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 23న జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించిన జేడీయూ సభ్యుడు వీరేంద్రకుమార్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి అదేరోజు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో ఎన్నికలు జరుగబోయే మొత్తం స్థానాల సంఖ్య 59 కానుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికలసంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మూడు చొప్పున మొత్తం ఆరు స్థానాలకు ఆరోజు ఎన్నిక జరుగనుంది. ఏప్రిల్ 2 తర్వాత ఏపీ నుంచి ముగ్గురు ఎంపీల (దేవేందర్ గౌడ్, రేణుక చౌదరి, చిరంజీవి) పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీల (సీఎం రమేశ్, రాపోలు ఆనంద భాస్కర్) సభ్యత్వం ముగియనుండగా.. జూలై 2017న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు.