సిరీస్ నీదా..నాదా..

SMTV Desk 2018-02-24 10:31:42  india, south africa, t-20, capetown, kohli

కేప్‌టౌన్‌, ఫిబ్రవరి 24 : కోహ్లి సేన దక్షిణాఫ్రికా పర్యటన తుది దశకు చేరుకొంది. మూడు టీ-20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు చివరి మ్యాచ్ జరగనుంది. తొలి టీ-20 లో విజయం సాధించిన టీమిండియా, రెండో మ్యాచ్ లో సఫారీ సారథి డుమిని, క్లాసెన్ మెరుపు బ్యాటింగ్ కారణంగా భారత్ జోరుకు బ్రేక్ పడింది. దీంతో 1-1 తో సిరీస్ సమం అయ్యింది. కాగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో విజయం సాధించి గెలుపు గర్వంతో స్వదేశంలో అడుగుపెట్టాలని భారత్ భావిస్తుంది. కోహ్లి సేన బ్యాటింగ్ పరంగా రోహిత్ తప్ప మిగతా వారందరూ మంచి ఫాంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ఇంతవరకు పటిష్టంగా ఉన్న చాహల్ పరిస్థితి పై జట్టులో ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రత్యర్ధి జట్టు ఈ మ్యాచ్ నెగ్గి సిరీస్ ను కైవసం చేసుకొని పరువు నిలుపుకోవాలని చూస్తుంది. ఇప్పుడు ఆ జట్టు ఆశలన్నీ క్లాసెన్ పైన పెట్టుకొంది. మిగతా వారి నుండి సహకారం లభిస్తే ఆ జట్టుకు విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎలా చూసుకున్న ప్రస్తుతం ఈ మ్యాచ్ అభిమానులకు సూపర్ మజాను అందించడం ఖాయంగా కన్పిస్తుంది.