అసెంబ్లీలో ఆత్మలు.. భయపడుతున్న ఎమ్మెల్యేలు..

SMTV Desk 2018-02-23 13:33:52  rajasthan assembly, evil spirits, MLAs fear

జైపూర్‌, ఫిబ్రవరి 23 : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళా.. అందరూ ప్రతి విషయాన్ని సాంకేతికత పరిజ్ఞానంతో విశ్లేసిస్తుంటే దెయ్యాలు, అత్మలంటూ, రాజస్థాన్‌ సెక్రటేరియట్‌ భయంతో వణుకుతుంది. ఏంటి నమ్మలేకపోతున్నారా..! ఇది నిజం.. ఈ మాట ఎవరో చెప్పింది కాదు సాక్షాతూ రాజస్తాన్ ఎమ్మెల్యేలు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలంలో మరణించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్మలుగా మారి రాజస్తాన్ అసెంబ్లీలో తిరుగుతున్నారని అక్కడి ఎమ్మెల్యేలు అంటున్నారు. దీంతో వారు శాంతిపూజలు చేస్తే తప్ప శాసనసభలో అడుగుపెట్టామని ఖరాఖండిగా చెబుతున్నారు. ఒకప్పుడు స్మశానంగా ఉన్న ప్రాంతంలో సెక్రటేరియట్‌ నిర్మించారని, దాంతో అందులో దెయ్యాలు తిరుగుతూ ఎమ్మెల్యేలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే హబీబుర్‌ రహ్మాన్‌ అన్నారు.