విజయానికి వారు అర్హులు : విరాట్

SMTV Desk 2018-02-23 13:03:17  kohli, india, southafrica, 2 nd t-20 match,

సెంచూరియన్‌, ఫిబ్రవరి 23 : దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లి సేన వరుస విజయాలకు సఫారీ జట్టు రెండో టీ-20 గెలుపుతో బ్రేక్ వేసింది. అంతే కాకుండా ఈ విజయంతో 1-1 తో సిరీస్ సమం కావడంతో రేపు జరగబోయే చివరి టీ-20 రసవత్తరంగా సాగనుంది. ఇంతవరకు ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లలో భారత్ జట్టు హవా కొనసాగింది. కానీ రెండో టీ-20లో ప్రోటీస్ జట్టు కోహ్లిసేనకు గట్టిపోటీనిచ్చింది. ఈ విషయంపై భారత్ సారథి విరాట్ మాట్లాడుతూ.."రెండో టీ20లో పోరాడి గెలిచిన దక్షిణాఫ్రికాకు అభినందనలు. దక్షిణాఫ్రికా నుంచి ఇలాంటి పోరాటమే మేము ఆశించం. వర్షం వల్ల బంతిపై పట్టు చిక్కకపోవడం ఈ మ్యాచ్‌లో మా బౌలర్లకు ప్రతికూలంగా మారింది. ఆరంభంలో వికెట్లు పడేసరికి 175 స్కోరు చేస్తే చాలనుకున్నాం. ఐతే పాండే, ధోని కలిసి అద్భుతంగా ఆడి స్కోరును 190 దగ్గరికి తీసుకెళ్లారు. తడి బంతి వల్ల మా బౌలర్లకు పట్టు చిక్కలేదు. క్లాసన్‌, డుమిని చాలా బాగా బ్యాటింగ్‌ చేశారు. సానుకూలంగా కనిపించారు. ఈ విజయానికి వారు అర్హులు’’ అని వ్యాఖ్యానించారు.