రైల్వే లెవెల్‌-1పోస్టులకు పది చాలు..

SMTV Desk 2018-02-23 11:33:47  railway level-1, posts, ssc qualification, central government

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: రైల్వే శాఖలో లెవెల్ -1 పోస్టులకు పదోతరగతి చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు రైల్వేశాఖ విద్యార్హతలను తగ్గించింది. పదో తరగతితోపాటు ఐటీఐ, తత్సమాన విద్యార్హత ఉండాలని మొదట నిబంధన విధించింది. దీనిపై దేశంలో ఉన్ననిరుద్యోగుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతోకాలంగా ఈ పోస్టుల కోసం వేచియున్నఅభ్యర్థులు తాజా నిర్ణయంపై చాలా ఆనందం వ్యక్తం చేశారు. పరీక్షార్థులకు 15 భారతీయ భాషల్లో ప్రశ్నపత్రాలను అందించనున్నట్లు వెల్లడించింది.