ఇకపై ఓటుకు ఆధార్‌..!

SMTV Desk 2018-02-20 11:48:11  vote, adhar link, fake votes, bjp leader ashvin kumar upadhyaay, election commission.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : నకిలీ, బోగస్ ఓట్లను కట్టడి చేసేందుకు ఆధార్‌ ఆధారిత ఓటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని న్యాయవాది, భాజపా నాయకుడు అశ్విన్‌కుమార్‌ ఉపాధ్యాయ్‌ ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో ఆధార్‌ ఓటింగ్‌ వ్యవస్థను అమలుచేసేలా ఎలక్షన్‌ కమిషన్ కు మార్గదర్శకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆధార్‌తో స్థిర, చర ఆస్తులను లింక్ చేయడం ద్వారా అవినీతిని అరికట్టేందుకు న్యాయపరంగా కేంద్రానికి సూచించాలన్నారు. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ అభ్యర్థనను నాలుగు వారాల తర్వాత విచారిస్తామని వెల్లడించింది.