ఆర్మూర్, ఫిబ్రవరి 19 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. గత ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలని గత శుక్రవారం నుండి డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతు జేఏసీ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆర్మూర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ కు మద్దతుగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు స్వచ్చందంగా మూసేశారు. ఆందోళన చేసేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.