నెల్లూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం..

SMTV Desk 2018-02-19 13:04:52  redsandal, smuggling, kavali, nellore

కావలి, ఫిబ్రవరి 19 : నెల్లూరు జిల్లా కావలిలో రూ. కోటి విలువ చేసే 50 ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు నాలుగు కార్లు, 24 సెల్‌ఫోన్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.