గెలుపే లక్ష్యంగా బరిలోకి కోహ్లి సేన..

SMTV Desk 2018-02-16 13:35:46  india, south africa, last odi, kohli, chahal

సెంచూరియన్, ఫిబ్రవరి 16 : దక్షిణాఫ్రికా గడ్డపై ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న కలను నిజం చేసిన కోహ్లి సేన ప్రస్తుతం సఫారీలతో చివరి పోరుకు సిద్దమయ్యింది. ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 4-1 తో సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా మరోసారి ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా 5-1 తో సిరీస్ ముగించాలని భావిస్తుంది. ఈ సిరీస్ తర్వాత మూడు టీ-20 ల సిరీస్ ఉంది. దీంతో భారత్ జట్టు రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉంది. జట్టులో మార్పులు చేస్తే మొహ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రత్యర్థి జట్టు వరుస ఓటమి భారంతో సతమతమవుతుంది. గులాబీ దుస్తులతో సాధించిన విజయం తప్ప ఆ జట్టు టీమిండియా కు అసలు పోటీ ఇవ్వలేదు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సౌతాఫ్రికా పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. కాగా ఇరుజట్ల మధ్య తుది పోరు ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ( భారత్ కాలమాన ప్రకారం) ప్రారంభం కానుంది.