తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరెన్సీ కష్టాలు..

SMTV Desk 2018-02-15 16:21:30  currency deficit, chandra babu naidu, trs mp, vinod kumar,

హైదరాబాద్, ఫిబ్రవరి 15 : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను కరెన్సీ కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు...రాష్ట్రానికి తక్షణమే రూ.5వేల కోట్ల నగదు పంపించాలంటూ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కూడా జైట్లీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణ చర్యలు చేపట్టాలని జైట్లీని కోరారు.