తుది వన్డేలో మార్పులు..!

SMTV Desk 2018-02-15 11:24:49  india, south africa, team change, kohli, odi series

పోర్ట్‌ఎలిజబెత్‌, ఫిబ్రవరి 15 : దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్ ను చేజిక్కుంచుకుని చరిత్ర సృష్టించిన టీమిండియా జట్టు మంచి జోష్ మీద ఉంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ కైవసం చేసుకున్న కోహ్లి సేన చివరి మ్యాచ్ లో గెలిచి 5-1 తో దక్కించుకోవాలని భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లను బరిలోకి దించాలనే వ్యూహంలో కోహ్లి ఉన్నట్లు సమాచారం. నామమాత్రమైన చివరి వన్డే శుక్రవారం సెంచూరియన్‌ వేదికగా జరగనుంది. ఆరు వన్డేల సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది.