వారి ప్రవర్తన అర్ధం కావడం లేదు : అద్వాణీ

SMTV Desk 2018-02-09 17:38:15  bjp senoiur leader lk advani, tdp mps, ap problems.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : బడ్జెట్ లో ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో భాజాపా సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీ వారితో మాట్లాడారు. ఏపీ సమస్యలపై దాదాపు 10 నిమిషాలు చర్చించిన ఆయన మాట్లాడుతూ.. సభా మర్యాదలు కాపాడుకుంటూ ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతోనూ మాట్లాడానని భరోసా ఇచ్చారు. అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదంటూ టీడీపీ ఎంపీల వద్ద నిరాశ వ్యక్తం చేసినట్లు సమాచారం.