మార్చి 5 వరకు లోక్‌సభ వాయిదా..

SMTV Desk 2018-02-09 15:33:54  loksabha, Postponed, march 5, speaker sumitra mahajan.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 : బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ స్పీకర్‌ పోడియం చుట్టూ చేరి నిరసన చేశారు. ఎంత చెప్పిన ఆందోళనను విరమి౦చకపోవడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈ గందరగోళం మధ్య సభను మార్చి 5కు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగడంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.