పోరాడండి.. రాజీపడొద్దు.. : చంద్రబాబు

SMTV Desk 2018-02-05 13:27:08  chandrababu naidu, teleconference, badjet comments, parliament protest.

అమరావతి, ఫిబ్రవరి 5 : బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం జరిగిందని.. ఈ మేరకు పార్లమెంట్ లో నిరసన చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు. అమరావతిలో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్ని సాధించే వరకు రాజీపడే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. "ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. కనీసం బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. నిధుల కేటాయింపు అసంపూర్తిగా ఉందని ఈ విషయాలన్ని పార్లమెంటులో చర్చకు తీసుకురండి. కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళండి" అని తెలిపారు.