మీర్ పేటలో దారుణం.. ముగ్గురి వరుస హత్యలు...

SMTV Desk 2018-02-05 10:34:04  meerpet, sensational murder, 3 peoples died, jilledaguda.

హైదరాబాద్, ఫిబ్రవరి 5 : హైదరాబాద్ మీర్ పేటలో తెల్లవారుజామున దారుణం వెలుగుచూసింది. జిల్లెలగూడలో ముగ్గురు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. జ్యోతి(33) అనే మహిళ సహా అభితేజ్(6), సహస్త్ర(5) అనే ఇద్దరు చిన్నారులు దారుణహత్యకు గురయ్యారు. జ్యోతి భర్త హరిందర్ గౌడ్ ఈ మూడు హత్యలు చేసినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో అతనే వచ్చి పోలీసుల ఎదుట ఒప్పుకొని లొంగిపోయాడు. అయితే హరిందర్ ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు అనేది తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలే కారణమా.? అనే కోణంలో పోలీసులు హరిందర్ ను విచారించనున్నారు.