స్పిన్నర్ లు తిప్పేశారు..

SMTV Desk 2018-02-04 16:06:46  india, second odi, southafrica, chahal,

సెంచూరియన్, ఫిబ్రవరి 4 : తొలి వన్డేలో సాధించిన విజయ ఉత్సాహంతో కోహ్లిసేన సఫారీలతో రెండో వన్డేలో అమోఘమైన ప్రదర్శన చేసింది. భారత్ బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైన్ ప్ చిగురుటాకుల వణికిపోయింది. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లి ప్రత్యర్ధికి బ్యాటింగ్ కు ఆహ్వనించాడు. బ్యాటింగ్ ఆరభించిన సఫారీలు ను భారత్ స్పిన్నర్ ద్వయం చాహల్, కులదీప్ యాదవ్ తమ మాయజాలంతో తిప్పేశారు. ఫలితంగా ప్రోటిస్ జట్టు 32.2 ఓవర్లు ఆడి 118 పరుగులకే పరిమితమయ్యింది. టీమిండియా బౌలర్లలో మణికట్టు మాంత్రికుడు చాహల్ అయిదు వికెట్లు, చైనా మెన్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి ఆతిధ్య జట్టు పతనాన్ని శాసించారు. బుమ్రా, భువనేశ్వర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.