గుంటూరు, ఫిబ్రవరి 3 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో "ఒమేగా ఆసుపత్రి"ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. నవ్యాంధ్రలో క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయటం శుభపరిణామ౦. క్యాన్సర్ వ్యాధితో ఎవరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేసిన ఆయన ప్రపంచంలోనే రాజధాని ఒక అద్భుతమైన మెడికల్ హబ్గా మారుతుందని పేర్కొన్నారు.