డర్బన్, ఫిబ్రవరి 1 : భారత్- సౌతాఫ్రికా ల మధ్య జరగనున్న డర్బన్ వేదికగా జరగనున్న తొలి వన్డే లో సఫారీ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ జట్టులో బ్యాట్స్ మెన్ రహెనే, స్పిన్ ద్వయం చాహల్, కులదీప్ యాదవ్ తుదిజట్టులో చోటు సంపాదించుకున్నారు. ప్రత్యర్ధి జట్టు డివిలియర్స్ కు బదులు మర్క్రం ను తీసుకుంది. కింగ్స్మీడ్ పిచ్ సాధారణంగా ఫాస్ట్బౌలర్లకే అనుకూలం. తొలి వన్డేకు కూడా పిచ్ భిన్నంగా ఏమీ ఉండదని అంచనా. బ్యాట్స్మెన్ మరీ ఆడలేని పరిస్థితేమీ ఉండదని.. పరుగులు వరద పారుతుందని సమాచారం.