బడ్జెట్ పై స్పందించిన రైల్వే మంత్రి..

SMTV Desk 2018-02-01 16:04:02  badjet, central railway minister, piyush goyal, comments.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : 2018-19 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేంద్రమంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "సమాజంలో ఉన్న ప్రతి ఒకరికి సమానంగా ఫలాలు అందేలా ఈ బడ్జెట్ ఉంది. ఇది ఒక సంతులిత బడ్జెట్. రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. మోదీ సర్కార్ కు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి నా అభినందనలు" అంటూ పేర్కొన్నారు.