న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: లోక్సభ ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ముఖ్యంగా ఆర్ధిక లోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ను మోదీ సర్కారు నిరాశపరిచింది.