న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : యావత్ భారతావని ఆశల బండి 2018-19 బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. జిఎస్టీ ఆమలు తర్వాత ప్రవేశపెట్టనున్న మొదటి బడ్జెట్ ఇదే కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ధిక మంత్రి హోదాలో జైట్లీకు ఈ బడ్జెట్ అయిదవ సారి కాగా ఎన్డీఏ ప్రభుత్వంకు ఇదే చివరిది. ఏప్రిల్ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం లోక్సభలో 11గంటలకు బడ్జెట్ను ప్రసంగ పాఠవాన్ని మొదలుపెట్టారు.