బొట్టుగూడ, జనవరి 29 : నల్గొండ జిల్లాలో మొండెం నుండి వేరు చేయబడిన తల స్థానికంగా కలకలం రేపుతోంది. మొండెం నుండి తలను వేరుచేసి స్థానిక జెండా గద్దెపై ఉంచారు. తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులు మొండెం లేకుండా ఉన్న తలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడ ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడంతో హత్య ఎక్కడో చేసి తలను మాత్రం ఇక్కడ పెట్టినట్లు భావిస్తున్నారు. అనంతరం మొండెం కోసం గాలింపు చర్యలు చేపట్టగా అదే గ్రామంలోని భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద ఉన్నట్లు కనుగొన్నారు. అయితే మృతుడిని కనగల్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పాలకుర్తి రమేష్గా గుర్తించారు. ప్రస్తుతం మొండాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రమేష్ను హత్య చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.