69 కి బదులు 59.. తడబడిన యూపీ మంత్రి

SMTV Desk 2018-01-26 18:14:49  UP EDUCATIONAL MINISTER, SANDEEP SINGH, SPEECH, LACNOW.

లక్నో, జనవరి 26 : సాధారణంగా ప్రజాప్రతినిధుల ఉపన్యాసం అంటే ఎవరైనా ఎంతో శ్రద్ధతో వింటారు. కాని ఈ మధ్య చాలా మంది రాజకీయ నాయకులు తమ అవివేకంతో చాలా పొరపాట్లు చేస్తున్నారు. తాజాగా సాక్షాత్తు ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సందీప్ సింగ్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా "69వ గణతంత్ర దినోత్సవాలకు బదులు 59వ గణతంత్ర దినోత్సవ వేడుకలు" అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంత్రి సందీప్ సింగ్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయనపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.