కోహ్లిసేనతో పోరుకు సఫారీ సైన్యం ఇదే...

SMTV Desk 2018-01-26 13:53:22  south africa, odi team, india , tour of india, duplesis,

జొహానెస్‌బర్గ్‌, జనవరి 26 : భారత్‌- సౌతాఫ్రికా జట్టు మధ్య ఆరు వన్డేల సిరీస్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తాజాగా భారత్‌తో మొదటి మూడు వన్డేలకు తలపడే జట్టును విడుదల చేసింది. వన్డే జట్టుకు డూప్లిసిస్‌ కెప్టెన్ గా కొనసాగానున్నాడు. సెంచూరియన్‌ టెస్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లుంగి ఎంగిడి వన్డే జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1న తొలి వన్డే డర్బన్‌ వేదికగా జరగనుంది. దక్షిణాఫ్రికా జట్టు: డూప్లిసిస్‌(కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, ఆమ్లా, మార్‌క్రమ్‌, డీకాక్‌(వికెట్‌కీపర్‌), జేపీ డుమిని, ఇమ్రాన్‌ తాహీర్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్రిస్‌ మోరిస్‌, వేన్‌ పార్నెల్‌, లుంగి ఎంగిడి, మోర్నే మోర్కెల్‌, రబాడ, పెలుక్వాయో, షంసీ.